Sunday, April 28, 2024

భూపాలపల్లిలో కాంగ్రెస్-బిఆర్‌ఎస్ మధ్య ఘర్షణ… పలువురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

మీనాజిపేట: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీనాజిపేటలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బిఆర్‌ఎస్ నేతల మందల రాజిరెడ్డి, ఓడేడు సర్పంచ్ బక్కన్న తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీస్ ఎదుట బిఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మంథని ఎంఎల్‌ఎ దుద్ధిల్ల శ్రీధర్ బాబు ఈ దాడిని ఖండించారు. బిఆర్‌ఎస్ నేతలు రౌడీ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News