Tuesday, May 7, 2024

ఎంఎల్‌ఎలకు క్లబ్ నిర్మిస్తాం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Club construct for MLA in Hyderabad

హైదరాబాద్: అసెంబ్లీలో ఎంఎల్‌ఎలు ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాల్సిందేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌లో ఎంఎల్‌ఎలకు క్లబ్ నిర్మిస్తామని, ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ తరహాలో క్లబ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అసెంబ్లీ వేధికగా ప్రజలకు చేరవేయాలన్నారు. అర్థవంతమైన, ముఖ్యమైన అంశమైతే ఎక్కువ సమయం ఇవ్వాలని, కొత్తగా నిబంధనలు, విధివిధానాలు రూపొందించుకోవాలని సూచించారు. తెలంగాణ అసెంబ్లీ దేశానికి ఆదర్శంగా నిలవాలని, నిర్వహణలో శాసనసభ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. సభ్యుల సంఖ్య తక్కువైనా విపక్షాలకు ఎక్కువ సమయం ఇస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News