Friday, May 3, 2024

ఐదు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

- Advertisement -
- Advertisement -

CM KCR Appointment of chairmen for five corporations

హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లను సీఎం కెసిఆర్ ఖరారు చేశారు. శుక్రవారం ఈ మేరకు ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా గజ్జెల నగేశ్, స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్, గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజుయాదవ్‌ను నియమించారు. ఇటీవలే మూడు కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎండీసీ) చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె క్రిశాంక్‌ను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఎండీసీ) చైర్మన్‌గా, ధుందాం. కళాకారుడు, వేద సాయిచంద్ (సాయిచందర్)ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. తాజాగా మరో అయిదుగురి కార్పొరేషన్ల చైర్మన్లగా నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News