Thursday, May 9, 2024

కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

ASJ court sentenced accused to 3 years in prison

హైదరాబాద్: హత్య కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎఎస్‌జే కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…. మహేశ్వరం మండలం, గొల్లూరు గ్రామానికి చెందిన మంద రమేష్ ఏప్రిల్ 15, 2014లో ఉదయం మూత్రవిసర్జనకు వెళ్లాడు. అదే ప్రాంతంలో గ్రామానికి చెందిన మంద వీరయ్య, మంద సత్తయ్య బైండింగ్ వైర్‌ను మోటార్‌కు వేశారు. కాలకృత్యాలకు వెళ్లిన రమేష్‌కు విద్యుదాఘాతం రావడంతో అక్కడికక్కడ మృతిచెందాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి కోర్టులో సాక్షాలను ప్రవేశపెట్టారు. సాక్షాలను పరిశీలించిన కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించింది. ఇన్స్‌స్పెక్టర్ గంగాధర్ దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News