- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పిఎస్ఎల్వి-సి 49 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ రాకెట్ ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-01తో పాటు మరో 9 ఉపహగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడం శాస్త్ర సాంకేతిక రంగాల పురోభివృద్ధికి ఎంతో ఊతమిస్తుందన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలతో పాటు సాంకేతిక సిబ్బందికి ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -