Sunday, April 28, 2024

ఆడబిడ్డల అపురూప వేడుక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పండుగ, ’బతుకమ్మ’ ఉత్సవాల ప్రారంభం (ఆదివారం నుంచి) సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్ష లు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు, పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా, రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సం బురం గొప్పగా వెల్లివిరుస్తుందని సిఎం తెలిపారు. పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సంస్కృతి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిందని రూ.350 కోట్ల ఖర్చుతో కోటి మంది ఆడబిడ్డలకు, ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన కోటి చీరెలను బతుక మ్మ కానుకగా అందిస్తూ గౌరవించు కుంటున్నామని శనివారం విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో సిఎం తెలిపారు. ప్రజల జీవనంలో భాగమైపోయిన ‘బతుకమ్మ’ ఖండాంతరాలకు విస్తరించి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాపితం చేసిందన్నారు. పండుగను జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సిఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని ప్రకృతి దేవత బతుకమ్మను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రార్థించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News