Friday, April 26, 2024

అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్లు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్నివాల్ వాహనాలు మంజూరు చేసింది. రవాణా శాఖ ద్వారా కొనుగోలు చేసిన ఆ వాహనాలను ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు ఆదివారం ప్రగతి భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో పాటు రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

CM KCR Inspects 32 Kia cars at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News