Sunday, April 28, 2024

వారంలో 100% వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

45 ఏళ్లు దాటిన వారందరూ టీకా వెయించుకోవాలి

Tika Utsav from April 11 to 14 across India

కరోనా పరీక్షలకు భారీగా పెంచాలి
అన్ని జిల్లా ఆర్‌టి-పిసిఆర్ టెస్టులు, విస్తృతంగా పరీక్షాకేంద్రాలు
అందరూ మాస్కులు ధరించేలా చర్యలు : సమీక్షలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా తిరిగి వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి సునిశిత జాగ్రత్తలు పాటించాలని, కరోనా కట్టడికోసం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలను కోరారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా జనం రద్దీగా వుండే ప్రాంతాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలతో పాటు కార్పోరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలు కరోనా పట్ల మరింత అప్రమత్తతతో మెలగాలని సిఎం సూచించారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడి నిర్వహించిన సిఎంల వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో, రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ఎంఎల్‌ఎలు పెద్ది సుదర్శన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు, డిఎంఇ రమేష్ రెడ్డి, ఎండి టిఎస్మెస్ ఐడిసీ చంద్రశేఖర్ వైద్యశాఖ సలహాదారు డాక్టర్ టి.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా తిరిగి పునరావృతమవుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను భారీగా పెంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలకు చెందిన ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి వందశాతం వ్యాక్సినేషన్ చేయించాలని అన్నారు. ఈ ప్రక్రియను వారం రోజుల్లో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా డిజిపి మహేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మతో ఫోన్‌లో మాట్లాడారు. వారి వారి శాఖల్లో పనిచేసే సిబ్బంది మొత్తానికి వాక్సినేషన్ ప్రక్రియను వారం రోజుల్లో నూటికి నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. వాక్సినేషన్ పురోగతిని ప్రతీ రోజు ఆయా శాఖల ఉన్నతాధికారులు సిఎంవోకు రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. పోలీస్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆర్‌టిసి, రెవెన్యూ శాఖల సిబ్బందికి వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం కోసం కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో వెంటనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సిఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచేందుకు, అన్ని జిల్లాల్లోనూ కరోనాను నిర్ధారించే ఆర్‌టిపిసిఆర్ పరీక్షా కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరమైన మేరకు ఆర్‌టిపిసిఆర్ కిట్స్ తక్షణమే తెప్పించాలని అధికారులను ఆదేశించారు. గద్వాల, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, భువనగిరి, జనగామ, వికారాబాద్ కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ పరీక్షా కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని వైద్య అధికారులను సిఎం ఆదేశించారు. కరోనా నియంత్రణ కోసం కీలకమైన మాస్కులు ధరించే నిబంధనను కఠినంగా అమలు పరచాలని అన్నారు. ప్రజలు మాస్కు ధరించకపోతే వేయి రూపాయల జరిమానా విధించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ నిబంధనను అందరూ పాటించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని డిజిపిని సిఎం ఆదేశించారు. 45 సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సిఎం ప్రజలను కోరారు.

CM KCR participates in PM Modi Video Conference

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News