Saturday, May 4, 2024

ప్రాణనష్టం జరగొద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షా ల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనల నుం చి ప్రజలను రక్షిస్తూ, ప్రాణనష్ట నివారణ చర్య లు చేపట్టే దిశగా మంత్రులను, ప్రజాప్రతినిధుల ను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఇందుకు సంబంధించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంత్రులతో ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ ప్రాణనష్టం జరగకుండా చూడాలని, అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదా లు జరిగితే వెంటనే వారికి మెరుగైన చికిత్స అం దించేలా చూసుకోవాలని సిఎం సూచించారు. ఆయా జిల్లాల్లోని ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులందరూ ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా,అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్య లు చేపట్టాలని ఆదేశించారు.

తక్షణ రక్షణ చర్య ల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కు మారికి సిఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆదేశాలను అనుసరించి అన్ని రకాల చర్యలను చేపడుతూ సిఎస్ సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాలు, టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. ముంపునకు గు రైన ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎస్ బృందాలు, రక్షణచర్యల కోసం హెలికాప్టర్లు సహా, ఆహారం, వైద్యం తదితర రక్షణ సామాగ్రి, సంబంధిత శాఖల యంత్రాంగాన్ని పంపించేలా చర్యలు చేపట్టారు. విపత్తుల నిర్వహణ శాఖకు, ఫైర్ సర్వీసుల శాఖకు, పోలీసు శాఖతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. అదే సందర్భంలో పోలీస్ యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొనేలా అప్రమత్తం చేయాల్సిందిగా రాష్ట్ర డిజిపిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు స్టేట్ లెవల్ ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి.డిజిపి పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను తరలించేందుకు పోలీసులు చేస్తున్న కృషి ఫలించింది
ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఆదేశాలు ః
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి, దాని ఉపనదులు, వాగులు, వంకలు ప్రమాద హెచ్చరికలు దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితుల్లో, వరద ముంపును తగ్గించే చర్యలు చేపట్టాలని, ఈ మేరకు ఇన్ ఫ్లోను ముందస్తు అంచనా వేసి, గేట్లు ఎత్తివేస్తూ, వరద నీటిని దిగువకు విడుదల చేయాలని చీఫ్ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్టులు, కడెం ప్రాజెక్టు, మిడ్ మానేరు, లోయర్ మానేరు తదితర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లకు స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్ చేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారు.

జిల్లా మంత్రులకు ఆదేశాలు ః
రాష్ట్రంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ప్రాణనష్టం జరగకుండా చూసేలా చర్యలు చేపట్టాలని ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ, సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కేటీఆర్ జిహెచ్‌ఎంసి పరిధిలో విస్తృతంగా పర్యటన చేపట్టారు. వానలోనే తడుస్తూ, ప్రజలను పరామర్శిస్తూ, అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూ రక్షణ చర్యల కోసం ముందుకు సాగారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ, సహాయ చర్యలను చేపట్టేలా జిహెచ్‌ఎంసి అధికారులకు ఆదేశాలిచ్చారు. వరద ముంపుకు గురైన ప్రాంతాలను పర్యటించి ప్రజలకు భరోసానిచ్చారు.

జిహెచ్‌ఎంసి అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేలా చర్యలు చేపట్టారు. సీఎం కేసీఆర్ మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఫోన్ చేసి గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన మోరంపల్లి గ్రామంలో ప్రజలను రక్షించేలా పరిస్థితిని సమీక్షించారు. స్వయంగా చలివాగుతో పాటు వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగు ముంపు ప్రాంతంలో కొనసాగుతన్న సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించి, అక్కడే బస చేస్తున్నారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి, పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించి ప్రజలకు ఆహారం, దుస్తులు అందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి, జిల్లాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎక్కడ అవసరమైతే అక్కడ అత్యవసర వైద్య సదుపాయాలు అందించేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.నిజామాబాద్ జిల్లలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పునరావాస సహాయక చర్యలు చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రశాంత్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కడెం ప్రాజెక్టు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కడెం ప్రాజెక్టు పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితులను ఆరా తీశారు.
అదే విధంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉదయం భద్రాచలంలో ప్రత్యేకాధికారి అనుదీప్ తో కలిసి గోదావరి వరద పరిస్థితిని పరిశీలించారు. ఖమ్మం జిల్లా మున్నేరువాగులో చిక్కుకున్న వారిని రక్షిచేందుకు స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంగంలోకి దిగారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో సహాయక కార్యక్రమాలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందుకు సంబంధించి మంత్రి పువ్వాడతో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ములుగు జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న పర్యాటకులను కాపాడేందుకు తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి భారీ వర్షాల పరిస్థితుల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూసీ తదితర ప్రాంతాల్లో రక్షణ చర్యలకై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో స్వయంగా తిరిగి ప్రజలకు భరోసానిచ్చారు. వరద నీరు ఇండ్లలోకి నీరు రాకుండా, సాఫీగా ప్రవహించేలా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా సూచనలు చేశారు. వరదల నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా పరిస్థితులను సమీక్షించారు.

కరీంనగర్ జిల్లా పరిధిలోని వరద పరిస్థితులను మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ మేరకు మానేరు డ్యామ్ వద్ద వరదను అధికారుల సహాయంతో కిందకు వదిలారు. జిల్లాలో వరద పరిస్థితిని సమీక్షించి, అధికారులకు ఆదేశాలిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను రక్షించేలా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం రేయింబవళ్ళు క్షేత్రస్థాయిలో ఉంటూ రక్షణ చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News