Monday, May 13, 2024

నేడు బెంగళూరుకు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మాజీ ప్రధాని దేవెగౌడతో ఆయన నివాసంలో మధ్యాహ్న భోజనం, చర్చలు

పాల్గొననున్న కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి

మనతెలంగాణ/హైదరాబాద్: నేడు (గురువారం) ఉదయం ముఖ్యమంత్రి కెసిఆర్ బెంగళూరుకు వెళ్లనున్నారు. భారత మాజీ ప్రధాని దేవెగౌడతో ఆయన నివాసంలో మధ్యాహ్నం భేటీ కానున్నారు. దేశ ప్రస్తుత రాజకీయాలు ఇ తర సమకాలీన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ లంచ్ సమావేశంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, దేవెగౌడ తనయుడు కుమారస్వామిలు పా ల్గొంటారు. బెంగళూరు పర్యటన సందర్భంగా సిఎం కెసిఆర్‌కు ఘన స్వాగతం లభించనుం ది. పద్మనాభనగర్‌లోని దేవెగౌడ ఇంటి పరిస రాల్లో అభిమానులు ముఖ్యమంత్రి కెసిఆర్ కటౌట్లను ఏర్పాటు చేశారు. దేశ్‌కీ నేత కెసిఆర్ అంటూ అభిమానులు కటౌట్లను ఏర్పాటు చేయడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News