Friday, May 10, 2024

హాయిగా.. అమ్మఒడిలో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో అంబులెన్సులు,  అమ్మ ఒడి, హర్సె (పార్థివ వాహనాల) సేవలు అందించేందుకు కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రా నున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మే రకు వైద్యారోగ్య శాఖ నూతనంగా 204 అం బులెన్స్‌లు, 228 అమ్మ ఒడి వాహనాలు, 34 హర్సె వాహనాలను కొనుగోలు చేసింది. వీటిని ఆగస్టు 1వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న 108, 102, పార్థివ వాహనాల ప నితీరుపై మంత్రి హరీశ్ రావు గత నెలలో సమీక్ష నిర్వహించారు. అత్యవసర సమయాల్లో ఆయా వాహనాల ద్వారా అందుతున్న సేవలను కొనియాడుతూ, సిబ్బందిని అభినందించారు. వాహనాల పనితీరు, రిపేర్లు, మెయింటెనెన్స్ వంటివి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. కాలం చెల్లిన అంబులెన్స్‌లు, అమ్మ ఒడి, హర్సె వాహనాలను వెంటనే తొలగించి, వాటి స్థానంలో నూతన వాహనాలను చేర్చాలని ఆదేశించారు. తద్వారా గర్భిణులు, రోగులను వేగంగా దవాఖానలకు చేర్చేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఈ మేరకు అధికారులు కొత్త వాహనాలను కొనుగోలు చేసి, బ్రాండింగ్ పూర్తి చేశారు.
455కు పెరగనున్న 180 వాహనాలు
ప్రస్తుతం రాష్ట్రంలో 426 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 175 అంబులెన్సుల స్థానంలో కొత్తవి రిప్లేస్ చేయిస్తుండగా, మరో 29 అంబులెన్సులను అవసరమున్నట్లు గుర్తించి కొత్త ప్రాంతాల్లో వినియోగించనున్నారు. ఈ 204 కొత్తవి కలిపితే రాష్ట్రంలో 108 అంబులెన్సుల సంఖ్య 455కు పెరగనున్నది.గర్భిణుల కోసం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి వాహనాలు (102 వాహనాలు) ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 300 ఉపయోగంలో ఉన్నాయి. ఇందులో 228 వాహనాలకు కాలం చెల్లిపోవడంతో వా టిని తొలిగించి, వాటి స్థానంలో కొత్తగా 228 వాహనాల ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రధాన ప్రభు త్వ దవాఖానల్లో మరణించినవారి పార్థివ దేహాలను స్వ స్థలాలకు తరలించడం కుటుంబ సభ్యులకు ఖర్చుతో కూ డుకున్న పని. అందుకోసం ప్రభుత్వం ఉచితంగా హర్ సే వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ హర్సె వాహనాలు ప్రస్తుతం 50 ఉన్నాయి. ఇందులో 34 వాహనాలకు కాలం చెల్లిపోయింది. ప్రభుత్వం కొత్తగా 34 వాహనాలను వీటి స్థానంలో రిప్లేస్ చేస్తున్నది.
సరికొత్తగా బ్రాండింగ్
కొత్తగా సమకూర్చుకున్న మూడు రకాల వాహనాలకు మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు సరికొత్తగా బ్రాండింగ్ చేశారు. 108, 102 అనే హెల్ప్‌లైన్ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేశారు. సిఎం కెసిఆర్ ఫోటో, తెలంగాణ ప్రభుత్వ లోగో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమ్మఒడి వాహనాలు మరింత ఆకర్షణీయంగా రూపొందించారు. వాహనం వెనుక భాగంలో అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో.. అనే ట్యాగ్‌లైన్‌తో పాటు సిఎం కెసిఆర్ ఓ బాలింతకు కెసిఆర్ కిట్‌ను అందిస్తున్న ఫొటోను ముద్రించారు. చూడటానికి ఆహ్లాదంగా ఉండే రంగుల్లో, అమ్మ ఒడి కార్యక్రమ లోగో, శిశువు ఫొటోలతో 102 వాహనాలు కొత్త లుక్‌తో అందుబాటులోకి రానున్నాయి. పార్థివ వాహనాల సేవలు ఉచితంగా అందిస్తామనే విషయాన్ని తెలిపేవిధంగా ఉచిత సేవ అని ముద్రించారు.
వైద్య సేవలు మరింత పటిష్టం : హరీశ్‌రావు
అత్యవసర సమయాల్లో ఉపయోగించే 108, 102తో పాటు, దురదుష్టవశాత్తు చనిపోయిన వారి పార్థీవ దేహాలను ఉచితంగా తరలించే హర్సె వాహనాలు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కొన్ని వాహనాలకు కాలం చెల్లిపోవడంతో తరు చూ మరమ్మతులకు గురవుతున్నాయని, ఈ నేపథ్యంలో పాత వాహనాల స్థానంలో కొత్తవి సమకూర్చుకోవడంతో పాటు, అవసరమున్నట్లు గుర్తించిన కొత్త ప్రాంతాల్లో వా హనాల సేవలు విస్తరించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు 466నూతన వాహనాలు సమ కూర్చినట్లు పేర్కొన్నారు. ఈ వాహనాల రాకతో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో మరింత వేగం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రమాదంలో ఉన్న వారికి అత్యవసర సేవలు వెంటనే అందుతాయని, ముఖ్యంగా వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రి నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆసుపత్రికి గర్బిణులు, బాలింతలను చేర్చే 102 వాహనాలను మరింత సౌకర్యవంతంగా రూపొందించి అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. ఇవి గర్బిణులు, బాలింతలకు ఎంతో ఉపయోగపడనున్నాయని చెప్పారు. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అం దించే విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడటం లేదని స్పష్టం చేశారు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి వైద్యారోగ్య రంగాన్ని పటిష్టం చేసి, ఆరోగ్య రంగంలో తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల మన్ననలను పొందుతుండటం సంతోషకరమని మంత్రి వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News