Wednesday, May 15, 2024

యోగాతో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది: మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొన్నేళ్ల క్రితం ఇళ్లు, ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ వ్యాప్తంగా 75 నగరాల్లో యోగా వేడుకలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మైసూరు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా ఫర్ హ్యుమానిటి నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచదేశాలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం యోగా ప్రపంచ నలుమూలలా విస్తరించిందని, యోగా ఆత్మవిశ్వాసం కలిగించడంతో పాటు జీవన విశ్వాసం ఇస్తుందన్నారు. కరోనా విపత్తు సమయంలోనూ యోగా నిర్వహించామని, సమాజంలో శాంతి నెలకొల్పుతుందని, సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుందన్నారు. జీవన విధానానికి మార్గంగా నిలుస్తుందని కొనియాడారు. వ్యక్తికే పరిమితం కాదని సక్రమంగా మానవాళికి ఉపయుక్తంగా ఉందని సూచించారు. యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని, ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు యోగా సందేశాన్ని చేరవేస్తున్నాయన్నారు. ప్రపంచ దేశాల్లో శాంతిని నెలకొల్పేందుకు యోగా దోహదం చేస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News