Wednesday, May 15, 2024

కొత్త జంటలకు లక్షా 60 వేల రూపాయలు!

- Advertisement -
- Advertisement -

మైనారిటీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. గురువారం మైనారిటీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రకటించింది. ఉర్దూ మీడియం టీచర్లకోసం ప్రత్యేకంగా డిఎస్సీ నిర్వహిస్తామని, ముస్లిం, క్రిస్టియన్ స్మశానవాటికల కోసం భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చింది. కొత్తగా పెళ్లయిన మైనారిటీలకు చెందిన జంటలకు లక్షా అరవైవేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొంది. వక్ఫ్ భూములను డిజిటలైజ్ చేస్తామని, మైనారిటీలకు ఇంటి జాగాతోపాటు ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News