- Advertisement -
హైదరాబాద్:రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. ప్రాణాలను లెక్కచేయకుండా 24 గంటలు ప్రజలందరి కోసం కుటుంబాలను వదిలేసి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలువరు పోలీసులు కరోనా బారిన పడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఓ కానిస్టేబుల్ బుధవారం రాత్రి కరోనాతో మృతి చెందారు. కలుసుంపుర పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ దయాకర్ రెడ్డికి ఇటీవల కరోనా సోకింది. దీంతో గత వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి బుధవారం రాత్రి మరణించాడు.
Conistable dies due to Covid 19 in Hyderabad
- Advertisement -