Thursday, May 9, 2024

సిగరెట్ డబ్బుల కోసం షాపుఓనర్‌ని చంపిన పోలీస్

- Advertisement -
- Advertisement -

Constable kills paan shop owner in uttarkhand

డెహ్రాడూన్ : పాన్‌షాపు యజమాని సిగరెట్‌కు డబ్బులు అడిగినందుకు ఓ కానిస్టేబుల్ తన స్నేహితులతో కలిసి అతడిని కారుతో ఢీకొట్టి చంపేసిన సంఘటన ఉత్తరఖాండ్ రాష్ట్రం ఉద్దమ్ సింగ్ నగర్ జిల్లా బాజ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కానిస్టేబుల్ ప్రవీణ్ తన స్నేహితులు గౌరవ్ రాథోర్, జీవన్‌తో కలిసి కారులో పాన్ షాపు ముందు ఆపారు. సిగరెట్ కావాలని షాపు యజమానిని అడిగారు. సిగరెట్ ఇచ్చిన తరువాత వారు వెళ్తుండగా డబ్బులు ఇవ్వాలని పాన్‌షాపు యజమాని డిమాండ్ చేశాడు. దీంతో పాన్‌షాపు యజమానికి, కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అతడిని కిందపడేసి కారును రెండు మూడు సార్లు షాపు యజమాని పైనుంచి పోనిచ్చారు. దీంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా స్థానికులు ఆందోళన చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని స్థానికులు డిమాండ్ చేశారు. కొంచెం సేపు ఆ స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News