- Advertisement -
న్యూఢిల్లీ: వచ్చేనెల 1న(ఫిబ్రవరి) తమకు అమలు చేయనున్న ఉరిశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ నిర్భయ సామూహిక అత్యాచార, హత్య కేసు దోషులు గురువారం ఇక్కడి పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నలుగురు దోషులలో కొందరికి ఇంకా న్యాయపరమైన పరిష్కారం లభించలేదని పేర్కొంటూ దోషుల తరఫు న్యాయవాది ఎపి సింగ్ కోర్టులో పిటిషన్ వేశారు. దోషులలో కొందరు ఇంకా న్యాయపరమైన పరిష్కారాలను పొందవలసి ఉందని న్యాయవాది పేర్కొన్నారు. ఢిల్లీ కారాగార నిబంధనల ప్రకారం క్షమాభిక్ష అభ్యర్థనతోసహా అన్ని న్యాయపరమైన ప్రత్యామ్నాయాలను కోరేవరకు దోషులలో ఏ ఒక్కరినీ ఉరితీయకూడదని న్యాయవాది తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ప్రత్యేక న్యాయమూర్తి ఎకె జైన్ ఈ రోజు సాయంత్రమే విచారణ చేపట్టనున్నారు.
Convicts seek stay on February 1 hanging
- Advertisement -