సిడ్నీ: కరోనా భయంతో మరో అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ అర్ధాంతరంగా రద్దయ్యింది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ మధ్యలోనే రద్దయిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్పై కూడా కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. కానీ, కరోనా భయంతో మిగతా రెండు మ్యాచ్లను రద్దు చేశారు. శనివారం జరగాల్సిన రెండో వన్డేతో పాటు ఈనెల 20న జరిగే మూడో వన్డేను కూడా రద్దు చేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
ఇక, న్యూజిలాండ్ క్రికెటర్లు శనివారం ఉదయమే స్వదేశానికి బయలుదేరి వెళ్లారు. కాగా, కరోనా ప్రభావం వల్ల ఇప్పటికే ఐపిఎల్తో సహా పలు క్రికెట్ టోర్నీలు, సిరీస్లు వాయిదా పడ్డాయి. పరిస్థితులు మాములుగా మారే వరకు క్రికెట్ టోర్నీలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు.
Corona Effect: AUS vs NZ ODI Series Called Off