- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వాన కురిసింది. దీంతో అనేక ప్రాంతాలు జలమయమై ట్రాఫిక్ స్తంభించింది. వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే కరోనా వైరస్ భయంతో ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు. ఈ సమయంలో వర్షం పడడంతో మరింత ఆందోళనలకు గురవుతున్నారు. వర్షం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గిపోతే కరోనా వైరస్ ఇంకా వేగంగా విస్తరించే అవకాశముంటుందని భయపడిపోతున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించారు.
Heavy Rain, Hailstorm Lash part of New Delhi
- Advertisement -