అత్త, అల్లుడి అక్రమ సంబంధం నవ వధువు ప్రాణం తీసింది. క్యాటరింగ్ చేసే వ్యక్తితో ఓ మహిళ అక్రమసబంధాన్ని నడిపిస్తూ.. అతడికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లి తర్వాత తన తల్లి, భర్త సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయిన కూతురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్మాస్ గూడ, త్రివేణి నగర్ లో నివాసం ఉంటున్న ఓ మహిళ క్యాటరింగ్ నిర్వహిస్తోంది. నవీన్ కుమార్ అనే వ్యక్తి కూడా క్యాటరింగ్ నిర్వహిస్తుండడంతో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో నవీన్ కుమార్ కు సదరు మహిళ డిగ్రి చదువుతున్న తన కూతురిని ఇచ్చి నవంబర్ 2019లో పెళ్లి చేసింది. పెళ్లైనా తర్వాత అత్త, అల్లుడుగా మారిన వారిద్దరు తమ సంబంధాన్ని అలాగే కొనసాగించారు. పెళ్లైన తర్వాత నవీన్ కుమార్ క్యాటరింగ్ ను అడ్డుపెట్టుకొని అత్త వద్దే ఉండేవాడు. దీన్ని సహించని యువతి పలుమార్లు భర్తకు వార్నింగ్ ఇచ్చింది. ఆయినా, నవీన్ కుమార్ అత్తతో తన సంబంధాన్ని మానుకోలేదు.
ఈ క్రమంలో వారిద్దరూ సన్నితంగా ఉండటాన్ని చూసి జీర్ణించుకోలేకపోయిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి గదిలో సూసైట్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన మరణానికి కారణం తన భర్త, తల్లే అని రాసి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి భర్త, తల్లిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Daughter suicide after Mother affair with Son in law