- Advertisement -
హైదరాబాద్: ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ను నిర్వహిస్తున్నామని డిఎంఇ రమేష్ రెడ్డి తెలిపారు. యుకె, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే సెకండ స్ట్రెయిన్ ఉంటే వారికోసం ప్రత్యేక వార్డులు ఉంటాయని, హైదరాబాద్లోని టిమ్స్లో ప్రత్యేకంగా రెండో ఫ్లోర్ కేటాయించామన్నారు. సెకండ్ స్ట్రెయిన్ కోసం జిల్లా ఆస్పత్రుల్లో కూడా ప్రత్యేక వార్డులు ఉన్నాయని రమేష్ తెలియజేశారు.
- Advertisement -