Sunday, May 5, 2024

సూపర్ స్ప్రెడర్లకే ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సూపర్ స్ప్రేడర్లకు టీకా కోసం పత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. ఎల్‌పిజి డెలివరీ సిబ్బంది, చౌకధరల షాపు డీలర్లు, పెట్రోల్ పంప్ కార్మికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లలోని విక్రేతలు, పండ్లు, కూరగాయలు, పూల మార్కెట్లు, కిరాణా షాపులు, మద్యం దుకాణాలు, మాంసాహార మార్కెట్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వ్యాక్సినేషన్ చేయాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యాక్సినేషన్‌పై చర్చించారు.
సూపర్ స్ప్రెడర్ల గుర్తింపు, ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ యన్.సత్యనారాయణ, రవాణా శాఖ కమిషనర్ యం.ఆర్.యం.రావు, ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News