Saturday, May 11, 2024

తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుతోంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Corona virus spread decreased in Telangana

 

రాజన్నసిరిసిల్ల: ప్రస్తుతం తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుతోందని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల కెటిఆర్ పర్యటన సందర్భంగా మాట్లాడారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్‌లో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. మళ్లీ వైరస్ తీవ్రత పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కరోనా చికిత్సలో వాడుతున్న అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే ఇంటింటి సర్వే రెండు సార్లు చేశామని కెటిఆర్ తెలియజేశారు. బ్లాక్, వైట్ ఫంగస్‌కు సంబంధించి మందులు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, కరోనాకు శాశ్వత పరిష్కారం వ్యాక్సినేషన్ మాత్రమేనని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News