Monday, May 6, 2024

24 గంటల్లో కరోనాతో 1133 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Coronavirus india details

 

ఢిలీ: భారత్‌లో కరోనా వైరస్ మరణమృదంగం మోగిస్తోంది. గత 24 గంటల్లో కరోనాతో 1133 మంది మరణించారు. సోమవారం ఒక్క రోజే 72809 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్‌తో చనిపోతున్నవారు 70 శాతం ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. గత పది రోజుల నుంచి దాదాపుగా 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కానీ నిన్న ఒక్క రోజే 72 వేల కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 42.8 లక్షలకు చేరుకోగా 72830 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 33.24 లక్షల మంది కోలుకోగా 8.83 లక్షల మంది చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News