Friday, April 26, 2024

సర్పంచ్ చెప్పుతో కొట్టాడని యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వీధి లైట్లు వేయాలని అడిగినందుకు యువకుడిని సర్పంచ్‌ చెప్పుతో కొట్టిన సంఘటన జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కుసుంబాయి తండాలో జరిగింది. దీంతో యువకుడు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. సర్పంచ్ ధరావత్ రమేష్ తన తండాలో వీధి లైట్లు వేస్తున్నాడు. తన ఇంటి ముందు ఉన్న స్తంభానికి లైట్ బిగించాలని సర్పంచ్‌ను ఎల్లేష్ కోరాడు. దీంతో ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన సర్పంచ్ రమేష్ ఎల్లేష్‌ను చెప్పుతో కొట్టాడు. వెంటనే ఎల్లేష్ తన ఇంటికెళ్లి భార్యతో తన బాధను వ్యక్తం చేశాడు. వెంటనే పురుగుల మందు తాగాడు. గ్రామస్థులు వెంటనే అతడిని జనగాం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎల్లేష్ మృతి చెందడంతో సర్పంచ్‌ను అరెస్టు చేయాలని స్థానిక పోలీస్ ఎదుట గ్రామస్థులు ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబానికి 10 గుంటల భూమి, 30 వేల రూపాయలు ఇచ్చే విధంగా తండా పెద్దలు తీర్పునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News