- Advertisement -
భువనేశ్వర్: భర్తతో కలిసి ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన ఘటన ఒడిశా అసెంబ్లీ ముందు మంగళవారం చోటుచేసుకుంది. భువనేశ్వర్లోని అసెంబ్లీ ప్రాంగణంలో దంపతులు నిప్పంటిచుకొని బలవన్మరాణానికి పాల్పడారు. జూలైలో తమ 5 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ చిన్నారి తల్లితండ్రులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వారిని గమనించిన పోలీసులు అడ్డుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -