Sunday, May 5, 2024

మాస్కు ధరించమన్నందుకు ఓ జంట హల్‌చల్

- Advertisement -
- Advertisement -

Couple without masks misbehave with Delhi police

పోలీసులతో దురుసు ప్రవర్తన

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఓ జంట హల్ చల్ చేసింది. కరోనా నిబంధనలు పాటించకుండా కారులో షికారుకు వెళ్లిన ఆ జంటను పోలీసులు అడ్డుకున్నారు. మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. దీంతో పంకజ్ దత్తా, అభా యాదవ్ అనే దంపతులు రెచ్చిపోయారు. పోలీసులకు దురుసుగా సమాధానమిచ్చారు. ‘నా భర్తకు ముద్దిస్తా, అడ్డుకుంటారా’ అంటూ పోలీసులపై ఫైర్ అయ్యింది. అనంతరం ఆమె భర్త కూడా నా కారు ఎందుకు ఆపావు అంటూ పోలీసుల మీద ఫైర్ అయ్యాడు. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా. విధుల్లో పోలీసులతో దురుసుగా మాట్లాడినందుకు ఆ జంటపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని ధరియాగంజ్‌లో చోటు చేసుకుంది. పోలీసులతో జంట ప్రవర్తించిన తీరు నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం భర్తను అరెస్ట్ చేయగా, భార్యను సోమవారంనాడు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికీ ఆ జంట తమ వైఖరిని సమర్థించుకుంటోంది. కారులో మాస్కు ధరించాల్సిన అవసరం లేదని, బహిరంగంగా ధరిస్తే సరిపోతుందని వాదిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News