Tuesday, May 21, 2024

బర్త్ డే… మొక్కలు నాటిన సిపిఐ నేత నారాయణ

- Advertisement -
- Advertisement -

చిత్తూరు: తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి CPI పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ  మొక్కలు నాటారు. పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి వేడుకలకు, హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండే కమ్యూనిస్టు నాయకులను సైతం గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఆకర్షిస్తూ వారు మొక్కలు నాటి మన్నలను పొందారు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టిన రోజు పురస్కరించుకుని తన స్వగ్రామం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఆయనంబాకం గ్రామంలో లో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఈ బృహత్కర కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News