Tuesday, April 30, 2024

ప్రజా సమస్యలపై స్పందించాలి: ఇర్ఫాన్ పఠాన్

- Advertisement -
- Advertisement -

Cricketers need to respond on Corona Issues: Irfan Pathan

ముంబై: కరోనా నేపథ్యంలో దేశంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ఈ సమస్యలపై క్రీడా ప్రముఖులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ప్రస్తుతం దేశం ఎంతో క్లిష్టసమయంలో ఉందని, ఎన్నో సమస్యలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. వీటిపై క్రీడా ప్రముఖులు ఏమాత్రం స్పందించక పోవడం మంచి పరిణామం కాదన్నాడు. సమస్యలపై క్రీడాకారులు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నాడు. అప్పుడే చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్నాడు. ఓ ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న ఇర్ఫాన్ ఈ విధంగా స్పందించాడు. దేశంలో ఇప్పటికీ చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నాడు. ఈ సమస్యలను ఎవరూ కూడా పట్టించుకోక పోవడంతో సమాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురికాక తప్పడం లేదన్నాడు. ఈ అంశాలపై క్రీడా ప్రముఖులు స్పందించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నాడు.

సమాజంలో క్రీడాకారులకు ఎంతో సముచిత గౌరవంగా లభిస్తుందని, వారు ఈ సమస్యలపై స్పందిస్తే పాలకులు దీన్ని పరిష్కరించేందుకు ముందుకు వస్తారనే నమ్మకాన్ని ఇర్ఫాన్ వ్యక్తం చేశాడు. సహజంగా ఎవరైనా క్రీడా ప్రముఖులు లేదా క్రికెటర్లు సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపై స్పందించడం అనవాయితీ అన్నాడు. అయితే భారత్‌లో మాత్రం ఇలాంటి స్పందన కొంత వరకు మాత్రమే కనిపిస్తుందన్నాడు. కొన్ని అంశాల్లోనే క్రికెటర్లు, ఇతర క్రీడా ప్రముఖులు స్పందిస్తూ ఉంటారన్నాడు. కానీ, ప్రజలను పీడిస్తున్న పలు అంశాలపై వారి నుంచి ఏమాత్రం స్పందన ఉండదని ఇర్ఫాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా క్రీడాకారులు, క్రికెటర్లు ప్రజా సమస్యలపై తమ గొంతు విప్పాల్సిన అవసరం ఎంతైన ఉందన్నాడు. అప్పుడే సమాజానికి మేలు జరుగుతుందని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు.

Cricketers need to respond on Corona Issues: Irfan Pathan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News