- Advertisement -
శ్రీనగర్: దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. ఎంత కట్టడి చేసిన కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జమ్మూకశ్మీర్లో సోమవారం కరోనా వైరస్ సోకి ఓ సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందాడు. సౌత్ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సదరు జవాను శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ గత గురువారం స్థానిక ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో అతను నాలుగు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు జమ్మూకశ్మీర్లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4వేలు దాటింది. ఇక, కరోనా బారిన పడి ఇప్పటివరకు 42 మంది మరణించారు.
CRPF Jawan dies due to Corona in Jammu Kashmir
- Advertisement -