శ్రీనగర్ః కరోనా వైరస్ సోకిందేమోనని భయంతో ఓ సిఆర్పిఎఫ్ జవాన్ గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసకున్నాడు. ఈ ఘటన దక్షిణ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలోని మతన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మతన్ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ 49వ బెటాలియన్లో రాజస్థాన్లోని జైసల్మార్కు చెందిన ఫతహ్ సింగ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, మంగళవారం సింగ్ తన గన్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గన్ శబ్ధం విని తోటి జవాన్లు ఏమందని చూడగా.. రక్తపు మడుగుల్లో పడి ఉన్న సింగ్ కనిపించడంతో వెంటనే పై అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే మృతిచెందిన సింగ్ నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. తనకు కరోనా వైరస్ సోకిందేమోనని భయపడినట్లు సింగ్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని సీనియర్ సిఆర్పిఎఫ్ అధికారి తెలిపారు. లాంగ్ డే డ్యూటీ తర్వాత సింగ్ తన యూనిట్కు తిరిగొచ్చాడని, ఆ యూనిట్ టీమ్లో అనారోగ్యానికి సంబంధించి ఎవరూ ఫిర్యాదు చేయలేదని సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
CRPF Jawan shot himself fearing to Covid 19 Infection