జమ్ముకశ్మీర్: పుల్వామా జిల్లా బందోజూ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. బందోజూ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉదయం 5:00గంటల నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. బండోజాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్క సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతాదళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదల స్థావారాన్ని చుట్టుముట్టారు. గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాబలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపింది. జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. జమ్ముకశ్మీర్ లోని ఎదో ఒక ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయి.
Two Terrorists Killed In Encounter In Jammu And Kashmir