Sunday, April 28, 2024

అక్టోబర్ 10 నాటికి రైతు వేదికల నిర్మాణం: సిఎస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అక్టోబర్ 10వ తేదీ నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రాష్ట్రంలో 17 జిల్లాలకు స్థానిక సంస్థల కోసం అదనపు కలెక్టర్ల నియామకంతో మొత్తం 29 మంది అదనపు కలెక్టర్లను స్థానిక వ్యవహారాలకు నియమించిన నేపథ్యంలో సిఎస్ సోమేష్ కుమార్ పట్టణ ప్రగతి, రైతు వేదికల నిర్మాణం, మున్సిపాలిటీల నూతనంగా చేర్చిన గ్రామ పంచాయతీల అభివృద్ధి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపాలిటీలలో నూతనంగా చేర్చిన గ్రామాలలో క్రిటికల్ ఇన్‌ఫాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం అవకాశం కల్పిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్లు ఈ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్నారు. మున్సిపాలిటీలలో పారిశుధ్య కార్యక్రమాలపై డిస్‌ఇన్‌ఫెక్టెంట్ స్ప్రే, యాంటీ లార్వల్, వెక్టర్ బర్న్ వ్యాధుల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి కొనసాగిస్తూ మరింత విస్తృతంగా చేపట్టాలన్నారు.

రైతు వేదికలకు సంబంధించి మిగిలిన మంజూరి పనులను వేగవంతం చేయాలన్నారు. రైతు వేదికల నిర్మాణ పనుల పర్యవేక్షణకు సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించాలన్నారు. వీటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్‌కు తగు ప్రణాళికను రూపొందించుకుని నిర్మాణ పనుల ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోవాలన్నారు. వీటితో పాటు రైతుబంధు, కల్లాల నిర్మాణం, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ల కోసం స్థలాలల ఎంపికతో పాటు ఉపాధి హామీ ద్వారా వివిధ శాఖలలో చేపడుతున్న కన్వర్జెన్స్ పనులపై సమీక్షించారు. సిఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రాధ్యానతలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

CS Somesh Kumar meeting with district Collectors

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News