Sunday, May 12, 2024

కర్ణాటకలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 87మంది మృతి

- Advertisement -
- Advertisement -

87 Record Corona Patients died in Karnataka

బెంగళూరు: కర్ణాటకలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో 3,176 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 87మంది బాధితులు మరణించారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 47,252కు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 933మంది చనిపోయారు. ప్రస్తుతం 24,673 మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి 18,467మంది కోలుకున్నారు.

87 Record Corona Patients died in Karnataka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News