- Advertisement -
హైదరాబాద్ః మహమ్మారి కరోనా వైరస్తో ఓ పోలీస్ హోంగార్డు కన్నుమూశాడు. నగరంలో డబీర్పురా పోలీస్ స్టేషన్కు చెందిన హోంగార్డు అశోక్ కుమార్ కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో మలక్పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అశోక్ కుమార్ పరీక్షలు చేయించుకోగా పాజిటీవ్ వచ్చింది. దీంతో అశోక్ కుమార్ అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో సదరు ప్రవేటు ఆస్పత్రిలో వైద్యం ఖర్చు భరించలేక అశోక్ కుమార్ను కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికు తరలించారు. అయితే, అశోక్ కుమార్ అప్పటికే మృతి చెందినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Dabeerpura Police Home Guard died due to Corona
- Advertisement -