Saturday, April 27, 2024

రాష్ట్రంలో కొత్తగా 231 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

231 New Corona Cases Reported in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 46,987 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 231 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,54,989కి చేరింది. మరో ఇద్దరు వైరస్ బారినపడి మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,858గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2కోట్ల 39లక్షల 42వేల 3మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మహమ్మారి నుంచి కొత్తగా 453 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 6,44,747 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,384 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.43 శాతంగా నమోదైంది.

231 New Corona Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News