Saturday, April 27, 2024

తెలంగాణలో కొత్తగా 638 కొవిడ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

638 New Corona Cases Reported in TS

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,14,105 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 638 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,41,791కి చేరింది. మరో ముగ్గురు వైరస్ బారినపడి మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,787గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల 14 లక్షల 30వేల 24మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. మహమ్మారి నుంచి కొత్తగా 715 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 6,28,679 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,325 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.95 శాతంగా నమోదైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,10,966 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో 3,139 మందికి పరీక్షలు చేయించుకున్నారు.

638 New Corona Cases Reported in TS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News