Saturday, April 27, 2024

తెలంగాణలో కొత్తగా 645 పాజిటివ్‌ కేసులు

- Advertisement -
- Advertisement -

1578 New Corona Cases Reported in AP

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 1,23,166 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 645 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,42,436కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 3,791మంది బాధితులు మరణించారు. తెలంగాణలో కొవిడ్‌ మరణాల రేటు 0.59 శాతంగా, రికవరీ రేటు 97.97 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 729 మంది బాధితులు చికిత్సకు కోలుకోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 6,29,408మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 9,237 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

645 New Corona Cases Reported in TS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News