- Advertisement -
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రతీ రోజు వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు బయటపడుతుండడంతో ప్రజలు భయందోళలనకు గురవుతున్నారు. ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 264 కరోనా కేసులు నమోదైనట్లు, కరోనాతో మరో ఇద్దరు మృతిచెందినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6,720కి చేరింది. ఇక, కరోనాతో మరించినవారి సంఖ్య 88కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో మొత్తం 2,341 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 2,851 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
264 New Corona Cases Reported in AP
- Advertisement -