Sunday, April 28, 2024

బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల దరఖాస్తుల గడువు పొడిగించారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు, స్పోర్ట్, క్యాప్ కోటా విద్యార్థులకు ఈనెల 27వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఆర్జీయూకేటికి ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూలై 3న విడుదల చేయనున్నట్లు బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు వెల్లడించారు. ఓసి, ఓబిసి విద్యార్థులకు దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 450 చెల్లించాలి. పదవ తరగతిలో వచ్చే మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయించనున్నట్లు ఆర్జీయూకెటీ విసీ తెలిపారు. 18 సంవత్సరాలు మించిన విద్యార్థులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News