Sunday, April 28, 2024

నర్సింగ్ స్కూళ్లో మూడేళ్ల కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ స్కూల్స్ లో 2023-24 విద్యా సంవత్సరానికి జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ ట్రైనింగ్ మూడేళ్ల కోర్సులో ప్రవేశానికి తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈనెల 16వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరింది. డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను ప్రభుత్వ స్కూళ్లలో ఈనెల 19వ తేదీ లోగా, ప్రైవేట్ స్కూళ్లలో వచ్చే నెల 10వ తేదిలోగా సమర్పించాలని పేర్కొంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అక్టోబర్ 4వ తేదీ నాటికి పూర్తవుతుందని ఈవిద్యా సంవత్సరానికి తరగతులు అక్టోబర్ 15వ తేదీ నుండి ప్రారంభమవుతాయని తెలిపింది. మరిన్ని వివరాల కోసం మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారిక వెబ్‌సైట్ http://dme.telangana.gov.inని సంప్రదించాలని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News