Friday, May 10, 2024

తండ్రిని చంపిన కూతురు….

- Advertisement -
- Advertisement -

Daughter murder to father

బెంగళూరు: వేధిసున్నాడని ఓ యువతి తన స్నేహితులతో కలిసి తండ్రిని హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ కు చెందిన దీపక్ కుమార్ సింగ్(45) తన కుటుంబ సభ్యులతో కలిసి యలహంక ప్రాంతం వీరసాగర్ రోడ్డులో నివసిస్తున్నాడు. తండ్రి ప్రతీ రోజు కూతురును వేధింపులకు గురిచేయడంతో అతడిని చంపాలని ఆమె నిర్ణయం తీసుకుంది. తన స్నేహితులతో కలిసి తండ్రిని చంపాలని ప్లాన్ వేసింది. ఆదివారం అర్థరాత్రి సమయంలో బాలిక స్నేహితులకు ఇంటికి పిలిపించుకుంది. గాఢ నిద్రలో ఉన్న తండ్రిపై కత్తులతో దాడి చేయించింది. అనంతరం ఘటనా స్థలం నుంచి స్నేహితులతో కలిసి పారిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News