Thursday, May 16, 2024

543 రోజుల తరువాత కనిష్టానికి చేరిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona cases decreased in India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 543 రోజుల తరువాత ఈ రోజు కరోనా కేసుల సంఖ్య కనిష్టానికి చేరాయి. మంగళవారం 9,64,980 మందికి కరోనా పరీక్షలు చేయగా 7579 మంది పాజిటివ్ రాగా 236 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క కేరళలోని 3698 కరోనా కేసులు నమోదుకాగా 75 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరుకోగా 4.66 లక్షల మంది చనిపోయారు. గత 24 గంటల్లో దాదాపుగా 72 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 117.63 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News