Tuesday, May 21, 2024

ఢిల్లీ బోణీ

- Advertisement -
- Advertisement -

రాణించిన లలిత్, అక్షర్ పటేల్
నాలుగు వికెట్ల తేడాతో ముంబైపై గెలుపు

Delhi capitals won on Mumbai indians
ముంబై : మెగా టోర్నీ ఐపిఎల్ 15వ సీజన్‌ను భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్రారంభించింది. బ్రబౌర్న్ వేదికగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ చేసింది. ముంబై నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 8 బంతులు మిగిలుండగానే విజయానందుకుంది. 178 పరుగులతో లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతూ ముంబైకు చుక్కలు చూపించారు. ఓపెనర్లు పృధ్వీషా, టిమ్ సిఫెర్ట్ భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో టిమ్ సిఫెర్ట్(21) పెవిలియన్ చేరగా. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మన్‌దీప్‌ను(0) అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రిషభ్ పంత్‌ను(1) కూడా మిల్స్ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన పృధ్వీషా(38), పావెల్(0) వికెట్లను బాసిల్ థంపి ఒకే ఓవర్‌లో తీశాడు. దీంతో 77 పరుగులకే ఢిల్లీ సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ నిలకడగా స్కోరు బోర్డును ముందుకు నడిపారు. ఈ క్రమంలో థంపి బౌలింగ్‌లో శార్దూల్ కూడా ఔటాయ్యాడు. ఇక ఆఖర్లో లలిత్ యాదవ్(48), అక్షర్ పటేల్(38) మెరుపు ఇన్నింగ్స్ ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. ముంబయి బౌలర్లలో బాసిల్ థంపి 3 వికెట్లు తీయగా, మురుగన్ అశ్విన్ 2 వికెట్లు తీశాడు. మిల్స్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ(41), ఇషాన్ కిషన్(81)లు దూకుడుగా ఆడుతూ జట్టుకు శుభారంభాన్ని అందించారు. అయితే నిలకడగా ఆడుతున్న సారథి రోహిత్ శర్మను ఢిల్లీ బౌలర్ కుల్‌దీప్ యాదవ్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్(8), తిలక్ వర్మ(22), పోలార్డ్(3), టిమ్ డేవిడ్(12) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఇషాన్ కిషన్(81), డానియల్ సామ్స్(7) నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలలో కుల్‌దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News