Wednesday, May 1, 2024

శ్రీవిష్ణు పెద్ద హీరో అవుతాడు

- Advertisement -
- Advertisement -

Dil Raju praised Srivishnu

శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. తేజ మర్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “అర్జున ఫల్గుణ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. శ్రీవిష్ణు ఏదో ఒక రోజు పెద్ద హీరో అవుతాడు. మా బ్యానర్‌లో కూడా అతను ఓ సినిమా చేయబోతున్నాడు”అని అన్నారు. దర్శకుడు తేజ మర్ని మాట్లాడుతూ “శ్రీవిష్ణుకు కథ చెప్పినప్పుడు ఫస్టాఫ్ విన్నాక ఆయనలో ఒక స్పార్క్ కనిపించింది. సెకాండఫ్ చెప్పగానే సినిమా చేస్తున్నానని చెప్పారు. ఆయన ఇచ్చిన ధైర్యమే నన్ను నిలబెట్టింది.

మంచి యాక్షన్, బ్యూటిఫుల్ ఎమోషన్‌తో.. సంక్రాంతికి ముందే ఈ సినిమా వచ్చిందని అనుకుంటారు”అని చెప్పారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ “గోదావరి జిల్లాల్లో కనిపించే మంచి మనుషుల మనసులు, అమాయకత్వాలు, సంప్రదాయాలు ఇవన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఐదుగురు అమాయకులు చిన్న సమస్యలో ఇరుక్కొని ఎలా బయటపడ్డారనేది ఈ సినిమా. ఈ సినిమా చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, అమృత్ అయ్యర్, తిరుమల కిషోర్, వివేక్ ఆత్రేయ, వెంకటేశ్ మహా, సాగర్ కె.చంద్ర, హసిత్ గోలి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News