Saturday, April 27, 2024

బుర్రవీణ కళాకారుడు కొండప్పను సత్కరించిన ‘బలగం’ టీమ్

- Advertisement -
- Advertisement -

బలగం సినిమాలో అయ్యో శివాడా ఏమాయే సాంగ్ పాడిన బుర్రవీణ కళాకారుడు కొండప్పను చిత్రయూనిట్ సత్కరించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొండప్పకు పద్మశ్రీ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బలగం డైరెక్టర్ వేణు, స్టార్ ప్రడ్యూసర్ దిల్ రాజుతోపాటు మేకర్స్ కొండప్పను కలిసి అభినందిస్తూ సన్మానించారు.

లక్ష రూపాయల చెక్ ను కూడా బహుకరించారు. అనంతరం తన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ.. బుర్రవీణ వాయిస్తూ పాట పాడారు కొండప్ప.ఈ సందర్భంగా తీసిన వీడియోను నిర్మాణ సంస్థ ఎక్స్ లో షేర్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News