- Advertisement -
హైదరాబాద్ : భారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ లో సహాయక చర్యల నిమిత్తం తమ ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాలని జిహెచ్ఎంసి పాలకవర్గం నిర్ణయించింది. హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ నెంబర్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు తమకు వచ్చే నాలుగు నెలల గౌరవ వేతనాన్ని కంటోన్మెంట్ బోర్డు సభ్యులు ముఖ్యమంత్రి సహాయనిధి అందించనున్నారు. ఈ మేరకు ఒక లేఖ ని పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు కి అందించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తమవంతు సాయం చేయడం తమ కర్తవ్యమని ఇదే బాటలో మరింతమంది పయనిస్తారని ఆశిస్తున్నామని ఈ సందర్బంగా కంటోన్మెంట్ బోర్డు సభ్యులు అన్నారు.
- Advertisement -