Friday, April 26, 2024

దోస్త్ రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Dost registration date Extension 2021

హైదరాబాద్ : దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఈ నెల 31వ తేదీన సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. మొదటి విడత సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1 నుంచి 5 వరకు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అన్నారు. దోస్త్ రెండవ విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు ఆగస్టు 1 ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 14న రెండవ విడత సీట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. గురువారం వరకు 1,40,581 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. అందులో 1,28,573 మంది ఫీజు చెల్లించగా, 88,123 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

Dost registration date Extension 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News