Thursday, May 16, 2024

రేపు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం

- Advertisement -
- Advertisement -

Drinking water not supply in Areas

 

మన తెలంగాణ,సిటీబ్యూరో: మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్ 2 రింగ్ మెయిన్2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుంచి చర్బుజా మార్బుల్స్ వరకు గల 1600 ఎంఎం డయా ఎమ్‌ఎస్ మెయిన్ పైపులైన్‌కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. దీంతో నేడు ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6గంటల వరకు మొత్తం 24గంటల పాటు పనులు కొనసాగుతాయి. సందర్భంగా రిజర్వాయర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఆదివారం వాటర్‌బోర్డు పేర్కొంది.ఆయా ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు …
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నెం. 2: బాలాపూర్, మైసారం, బార్కాస్
2. ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం. 5: మేకలమండి, భోలక్‌పూర్
3 ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం. 7: తార్నాక, లాలాపేట్, భౌద్దనగర్, మారేడుపల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్‌ఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్‌నగర్, పాటిగడ్డ.
4 ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం 9: హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్
5. ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం. 10: వైశాలినగర్, బిఎన్‌రెడ్డినగర్, వనస్దలిపురం, ఆటోనగర్, మారుతినగర్
6. ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం. 13: మహింద్రహిల్స్
7. ఓ అండ్ ఎమ్ డివిజన్ నెం. 14: ఏలుగుట్ట, రామంతపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకనగర్, బీరప్పగడ్డ
8. ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం 19: బోడుప్పల్‌లోని కొన్ని ప్రాంతాలు
9. ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం. 20: మీర్‌పేట, బడంగ్‌పేట,శంషాబాద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News