Tuesday, May 7, 2024

రూ.92 లక్షలతో పారిపోయిన డ్రైవర్ అరెస్టు: సిపి

- Advertisement -
- Advertisement -

Thief

 

హైదరాబాద్: ఎటిఎం మిషన్లలో డబ్బు నింపే వాహనం నుంచి రూ.92 లక్షలు డ్రైవర్ ప్రకాశ్‌ చోరీకి పాల్పడడంతో అతడిని పోలీసలు అరెస్టు చేశారు. తోటి సిబ్బంది కళ్లుగప్పి రూ.92 లక్షలతో డ్రైవర్ పారిపోయాడు. లాలాపేట్‌లో డ్రైవర్‌ను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రకాశ్‌గా గుర్తించామని సిపి అంజనీకుమార్ తెలిపారు. నిందితుడిని గుర్తించేందుకు 500 సిసి కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించామని తెలిపారు. ఎటిఎంలో నింపాల్సిన రూ.92 లక్షలను ఎత్తుకెళ్లాడని సిపి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News