- Advertisement -
హైదరాబాద్ : మెదక్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నవంబర్ 3న దుబ్బాక నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించగా 10న కౌంటింగ్ జరగనుంది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలతో పాటు నామినేషన్ల దాఖలుకు చివరితేదీ అక్టోబర్ 16 అని వెల్లడించింది. నామినేషన్లను 17న పరిశీలించగా, ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 19గా నిర్ణయించడం జరిగింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూయడంతో దుబ్బాకలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, స్వతంత్ర్య అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో ఈ రోజు నుంచి దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
- Advertisement -